Sunday, June 29, 2025

ఎమోషనల్ అవుతారు.. పగలబడి నవ్వుతారు

- Advertisement -
- Advertisement -

సందీప్ రాజ్ షో రన్నర్‌గా హర్ష రోషన్, భాను, జయతీర్థ ప్రధాన పాత్రల్లో జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ఎయిర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్. జూలై 3 నుంచి ఈ సిరీస్ ఈటీవి విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. హీరోలు శివాజీ, సుహాస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో హీరో శివాజీ మాట్లాడుతూ.. “చదువు అనేది సహజంగా చదవాలి. కేవలం ర్యాంక్స్ కోసం చదవడం అనేది ఒక రకమైన హింస. ఈ సిరీస్ అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి” అని అన్నారు.

షో రన్నర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ.. “అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. ఎమోషనల్ అవుతారు. పగలబడినవ్వుతారు. అంత యూనివర్సల్ కంటెంట్. ప్రతి డైలాగ్‌కి కనెక్ట్ అవుతారు. నితిన్, సాయి కృష్ణ ఈ కంటెంట్‌ని అద్భుతంగా నడిపించారు”అని తెలిపారు. డైరెక్టర్ జోసేఫ్ మాట్లాడుతూ.. “అందరికీ ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. కంటెంట్ కూడా ఎంజాయ్ చేసేలా ఉంటుంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చాందిని, సాయి కృష్ణ, నితిన్, హర్ష రోషన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News