బెంగళూరు: భర్త కళ్లలో కారం కొట్టి అనంతరం కర్రతో పలుమార్లు తలపై బాది, గొంతును కాలుతో తొక్కి చంపేసి మృతదేహాన్ని 30 కిలో మీటర్ల దూరంలో పడేసింది. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం తిప్పటూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శంకర్ మూర్తి, సుమంగళ అనే దంపతులు తిప్పటూర్ గ్రామంలో నివసించేవారు. కల్పటారు గర్ల్ హాస్టల్లో సుమంగళ వంటలు చేసేది. కరుడలుశాంటే గ్రామానికి చెందిన నాగరాజుతో సుమంగళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరు అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా వస్తుండడంతో హత్య చేయాలని ప్లాన్ వేసింది.
ప్లాన్లో భాగంగా ఫామ్హౌస్లో ఒంటరిగా ఉన్నప్పుడు శంకర్మూర్తి కళ్లలో భార్య కారం చల్లింది. అనంతరం కర్ర తీసుకొని పలుమార్లు బాదడంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే గొంతుపై కాలుతో తొక్కి హత్య చేసింది. అనంతరం ప్రియుడు నాగరాజుకు సమాచారం ఇచ్చింది. ఇద్దరు కలిసి మృతదేహాన్ని బస్తాలో మూటకట్టి 30 కిలో మీటర్ల దూరం గల దండనిశవర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బావిలో పడేశారు. శంకర్ మూర్తి కనిపించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బెడ్పైన కారం పొడి కనిపించడంతో భార్యను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో పాటు కాల్ రికార్డును పరిశీలించారు. భార్య తానే చంపానని నిజాలు ఒప్పుకోవడంతో ఆమెతో పాటు ప్రియుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.