Monday, June 30, 2025

పెళ్లి కోసం అమెరికా వెళ్లి యువతి మిస్సింగ్..!

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: పెళ్లి చేసుకునేందుకు అమెరికా వెళ్లిన ఓ భారతీయ అమ్మాయి మిస్ అయినట్లు తెలుస్తోంది. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో పెద్దలు కుదిర్చిన వివాహం కోసం వచ్చిన కొద్ది రోజులకే 24 ఏళ్ల భారతీయ అమ్మాయి అదృశ్యమైందని అక్కడి అధికారులు తెలిపారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. జూన్ 20న భారత్ నుండి వివాహం కోసం వచ్చిన సిమ్రాన్ న్యూజెర్సీలో అదృశ్యమైంది. న్యూజెర్సీలోని లిండెన్‌వోల్డ్ లో బుధవారం సిమ్రాన్ అదృశ్యమైన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. నిఘా ఫుటేజ్‌లో ఆ మహిళ తన ఫోన్‌ను చూస్తూ ఎవరికోసమో వేచి చూస్తున్నట్లు కనిపిస్తున్నట్లు తెలిపారు. వీడియోలో ఆమె బాధలో ఉన్నట్లు కనిపించడం లేదని చెప్పారు.

వివాహం కోసం సదరు మహిళ అమెరికాకు వచ్చిందని.. అయితే, ఆమెకు వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేదని, అమెరికాకు ఉచిత ప్రయాణాన్ని పొందడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉండవచ్చని పోలీసులు తెలిపారు. సిమ్రాన్‌కు అమెరికాలో తెలిసిన బంధువులు ఎవరూ లేరని, ఆమెకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు అని పోలీసులు తెలిపారు. ఆమె అంతర్జాతీయ ఫోన్ Wi-Fi ద్వారా మాత్రమే పనిచేస్తుందని చెప్పారు. సిమ్రాన్ కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు న్యూజెర్సీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News