Friday, August 15, 2025

పటాన్ చెరు కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు.. 10 మంది మృతి!

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరులో విషాదం ఘటన చోటుచేసుకుంది. పాశమైలారం పారిశ్రామిక వాడలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. పని చేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడుతో భారీ శబ్దం రావడంతో భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. కొందరు కార్మికులు పేలుడు తీవ్రతకు దాదాపు 100 మీటర్ల దూరుంలో ఎగిరి పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 10మంది కార్మికులు చనిపోయినట్టు సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన అనేక మంది కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News