ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా హెడ్డింగ్లే వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఓటమిపాలైంది. దీంతో రెండో టెస్ట్లో విజయం సాధించి సిరీస్ను సమం చేయాలని గిల్ సేన పట్టుదలతో ఉంది. తొలి టెస్ట్ మ్యాచ్లో ఓడినప్పటికీ.. భారత టాప్ ఆర్డర్ బ్యాటింగ్ అదరగొట్టింది. యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, శుభ్మాన్ గిల్ సెంచరీలు చేయగా.. రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్లోనూ శతకాలు బాదాడు. ఈ క్రమంలో కెఎల్ రాహుల్, పంత్లపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) ప్రశంసల వర్షం కురిపించారు.
వాళ్లిద్దరూ ఈ సిరీస్లో అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తారని ఆయన అన్నారు. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న రిషబ్ పంత్.. రెండో టెస్ట్లోనూ దాన్ని కొనసాగిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే టెస్ట్లో రెండు ఇన్నింగ్స్లో సెంచరీ సాధించడం అంటే మామూలు విషయం కాదని ఆయన కొనియాడారు. పంత్ పరుగుల దాహంతో ఉన్నాడని.. మరిన్ని పరుగులు కచ్చితంగా సాధిస్తాడని పేర్కొన్నారు. అలాగే తొలి టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసిన రాహుల్ ఒక సెంచరీతో ఆగిపోడని.. తర్వాతి మ్యాచ్లలో ఇంకా అదరగొడతాడని మంజ్రేకర్ (Sanjay Manjrekar) తెలిపారు.
భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జరగనుంది. వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా ఈ మ్యాచ్కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ జట్టులోకి జోఫ్రా ఆర్చర్ వచ్చే అవకాశం ఉంది.