Tuesday, July 1, 2025

క్వాంటమ్ కంప్యూటింగ్ ను మనం అందిపుచ్చుకోవాలి : చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తాను తొలిసారి సిఎం అయినప్పుడు ఐటి పరిశ్రమ విస్తరిస్తోందని చెప్పానని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఎలాగో అమరావతికి క్వాంటం వ్యాలీ అలాగని, క్వాంటం శాటిలైట్ ఆవిష్కరణలతో సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలకు ఆకాశమే హద్దు అని క్వాంటం కంప్యూటింగ్ ను ప్రమోట్ చేసేందుకు ముందుంటానని అన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ను మనం అందిపుచ్చుకోవాలని సూచించారు. తమతో కలిసి వచ్చిన టిసిఎస్, ఐబికి, ఎల్ అండ్ టికి అభినందనలు తెలియజేశారు.

బిల్డగేట్స్ ను కలిసి ఐటీ విస్తరణ గురించి చర్చించానని పిపిపి మోడల్ లో హైటెక్ సిటీ కట్టాలని ఎల్ అండ్ టీని కోరానని అన్నారు. తర్వాత బెంగళూరు, గుర్గామ్ లోనూ ఐటి భవనాలు కట్టిందని, భవిష్యత్తులో భారత్ అదిపెద్ద ఐటి హబ్ గా మారుతుందని ఆనాడే చెప్పానని అన్నారు. జనవరి 1 నుంచి ఎపిలో క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలు నిర్వహిస్తామని, అమరావతిలో టెక్ వ్యాలీ పార్కు(Tech Valley Park) లోనే లక్షల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని అన్నారు. ఇతర రాష్ట్రాలూ సేవలు వినియోగించుకునే వెసులుబాటు ఉంటుందని, అనేక రంగాల్లో విస్తృతంగా క్వాంటమ్ సేవలు జరుగుతాయని పేర్కొన్నారు. క్వాంటమ్ మిషన్ కు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిందని చంద్రబాబు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News