Tuesday, July 1, 2025

మృతుల కుటుంబాలకు మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ చేయూత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూర్:  మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని ఇందిరా నగర్ లో ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలకు మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయం అందించి చేయూతనిచ్చారు.కాలనికి చెందిన బుషిపాక వినోద్, పారిశుద్ధ్య కార్మికుడు కందుకూరి మల్లయ్యలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయా కుటుంబాలకు మన మోత్కూర్ స్వచ్చంధ సేవ సంస్థ వాట్సప్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయం అందించారు. బుషిపాక వినోద్ కి రూ.12 వేలు, మల్లయ్యకు రూ.5 వేల చెక్కును స్వయంగా అందజేశారు.

సోషల్ మీడియాలో ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆర్ధిక సహాయం అందించడంలో మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గ్రూప్ సభ్యుడు బద్ధం నాగార్జున రెడ్డి వినోద్, కందుకూరి బిక్షమయ్య కుటుంబాలకు చెరో 50 కిలోల చొప్పున బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో వాట్సప్ గ్రూప్ సభ్యులు ధబ్బేటి సోంబాబు, కారుపోతుల వెంకన్న, మున్సిపల్ కో ఆప్షన్ మాజీ సభ్యులు గణగాని నర్సింహా, గ్రూప్ సభ్యులు మొరిగాల శ్రీను, అవిశెట్టి స్వామి, గడ్డం లక్ష్మయ్య, దాసరి తిరుమలేష్, బోడ బాబురావ్, ఎండి షాకీర్, బండారు ప్రశాంత్ రెడ్డి, గడ్డం సోమనర్సయ్య, జిట్ట సాయి కుమార్, నవీన్, దాసరి ఎలెందర్, ఓర్సు మహేష్, మందుల మల్లేష్, సత్తయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News