Tuesday, July 1, 2025

ఆధారాలు లేకుండా రాస్తే చర్యలు కఠినంగా ఉంటాయి: జగదీశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు ఏం సంబంధం? అని బిఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) మండిపడ్డారు. పథకం ప్రకారం కెసిఆర్ కుటుంబంపై కక్షసాధింపు జరుగుతోందని అన్నారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఏ విచారణ అధికారైనా కెసిఆర్, కెటిఆర్ పేరు చెప్పారా? అని ఫోన్ ట్యాప్ (Phone tap) చేశారని ఏ అమ్మాయైనా ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. ఊహించి రాసి ఇదే జర్నలిజం అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆధారాలు లేకుండా రాస్తే తమ చర్యలు కఠినంగా ఉంటాయని, దుష్ప్రచారంపై కెసిఆర్ ఊరుకున్నా తాము ఊరుకోం? అని ధ్వజమెత్తారు. దేశంలో ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరగడం లేదా? అని ఇప్పుడు ట్యాపింగ్ జరగట్లేదని సిఎం రేవంత్ రెడ్డి చెప్పగలరా? అని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News