డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) వర్సటైల్ హీరో విజయ్ సేతుపతితో కలిసి అత్యంత ప్రతిష్టాత్మక పాన్ -ఇండియా మూవీ చేయబోతున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పూర్తయిన ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. నిర్మాతలు స్టార్ నటీనటులను ఒక్కొక్కరిగా పరిచయం చేయడంతో ఈ ప్రాజెక్ట్ చుట్టూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ అత్యంత ప్రతిష్టాత్మ కమైన వెంచర్ని పూరి జగన్నాథ్ పూరి కనెక్ట్ బ్యానర్లో చార్మీ కౌర్ (Charmi Kaur banner) సమర్పకురాలిగా, జెబి మోషన్ పిక్చర్స్ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లాతో కలిసి నిర్మిస్తున్నారు. జెబి మోష న్ పిక్చర్స్తో కొలాబరేషన్ ఈ మూవీ గ్రాండియర్ ని మరింతగా పెంచుతోంది.
ఇక దర్శకు డు పూరి జగన్నాథ్ సినిమాకి సంబధించిన అన్నీ విషయాల్లో చాలా శ్రద్ధ తీసుకుంటు న్నారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులని అలరించే స్క్రిప్ట్, నటీనటులని ఎంపిక చేశారు. ఈ చిత్రం లో విజయ్ సేతుపతి సరసన సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు, విజయ్ కుమార్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. జూలై మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ పాన్- ఇండియా ఎం టర్టైనర్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఐదు భాషలలో విడుదల కానుంది.