- Advertisement -
హైదరాబాద్ శివారులోని నార్సింగిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు.1.5 కోట్ల విలువ చేసే 650 గ్రాముల హెరాయిన్ శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటి పోలీసులు నార్సింగీ వద్ద మాటు వేసి పట్టుకున్నారు.ఓ బ్యాగ్ లో హెరాయిన్ తీసుకొని వస్తున్న వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. 650 గ్రాముల గోదుమ కలర్ హెరాయిన్ పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ లో కొనుగోలు చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు సమాచారం. పట్టుబడిన వ్యక్తే హెరాయిన్ కంజూమ్ చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఎన్డీపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన నార్సింగీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హెరాయిన్ విక్రయించిన వ్యక్తి పై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం వెతకటం ప్రారంభించారు.
- Advertisement -