- Advertisement -
చిన్న కాళేశ్వరం కెనాల్ పనులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ టస్కర్ కాలనీ రైతులు గురువారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, రైతులు మాట్లాడుతూ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు గ్రావిటీ కెనాల్ మాకు అవసరం లేదు. మేము మా భూములను ఇవ్వమని పనులను అడ్డుకోవడంతో మహాదేవపూర్ తహసీల్దారు వై.రామారావు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడుతూ నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో రైతులు ససేమిరా అనడంతో అధికారులు వెనుతిరిగి వెళ్లారు.
- Advertisement -