- Advertisement -
అమరావతి: విద్యార్థుల సంక్షేమాన్ని కూటమి సర్కారు పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ (Srinivasa Venugopala Krishna) అన్నారు. కూటమి పాలనలో వ్యవస్థలు ధ్వంసమయ్యాయని విమర్శించారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన మీడియాతో మాట్లాడుతూ.. వసతి గృహాల్లో (dormitories) పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని మండిపడ్డారు. హాస్టళ్లలో పనికిరాని రేషన్ బియ్యం ప్రజలకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. హోంమంత్రి అన్నంలో బొద్దింక రావడమే ఇందుకు నిదర్శనం అని కూటమి ప్రభుత్వాన్ని శ్రీనివాస వేణుగోపాల కృష్ణ దుయ్యబట్టారు.
- Advertisement -