- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి రాజేంద్రనగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యవసాయ యూనివర్సిటీలోని బొటానికల్ గార్డెన్స్లో రుద్రాక్ష మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, తదితరలు పాల్గొన్నారు. ఫొటో ఎగ్జిబిషన్ను రేవంత్ తిలకించారు. తెలంగాణ వ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- Advertisement -