డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి తొలిసారిగా కలిసి చేస్తున్న పాన్- ఇండియా మూవీ ‘పూరిసేతుపతి’. (Puri Sethupathi) ఈ ప్రాజెక్ట్ను జెబి మోషన్ పిక్చర్స్ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లాతో కలిసి పూరి కనెక్ట్ బ్యానర్పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే లాంచ్ అయిన ఈ సినిమా సోమవారం హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సంయుక్త, ఇతర తారాగణం సభ్యులు పాల్గొనే కీలక సన్నివేశాలను భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి విరామం లేకుండా షూటింగ్(Non-stop shooting) శరవేగంగా కొనసాగుతోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమా ప్రతి అంశంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టబు, విజయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఐదు భాషలలో విడుదల కానుంది.
‘పూరిసేతుపతి’ షూటింగ్ షురూ
- Advertisement -
- Advertisement -
- Advertisement -