- Advertisement -
అమరావతి: ఎపిలో ఏదో జరుగుతుందని మాజీ సిఎం వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి గగ్గోలు పెడుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) తెలిపారు. జగన్ కు పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేశవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎపి బ్రాండ్ ను దెబ్బతీసేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నానని అన్నారు. ఎపిలో పరిశ్రమలు (Industries AP) పెట్టొద్దని పారిశ్రామిక వేత్తలకు ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తితో రెండు వందల మెయిల్స్ పెట్టించారని మండిపడ్డారు. ఆ తర్వాత లేళ్ల అప్పిరెడ్డిని తెరపైకి తెచ్చారని తెలియజేశారు. ఎన్ని కుట్రలు చేసినా ఎపి బ్రాండ్ ఎక్కడా తగ్గలేదని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
- Advertisement -