- Advertisement -
అమరావతి: వయసైయి పోయి ఎన్నికల్లో పోటీకి కొడుకుని దింపిన విషయం వైసిపి నేత, మాజీ మంత్రి పేర్నినాని మరిచారా? అని ఎపి హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anita) అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై పేర్నినాని చేసిన వ్యాఖ్యలపై అనిత స్పందించారు. నిద్రలేస్తూనే 4 రకాల మందులు, 10 సంతకాలు పెట్టడానికి చేతులు వణికే వారూ చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. ఎవరు ఎప్పుడు చనిపోతారో చెప్పడానికి.. పేర్నినాని ఏమన్నా దేవుడా? అని ప్రశ్నించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో(provocative comments) పబ్బం గడుపుకోవాలని చూసే వారిని ఉపేక్షించమని హోంమంత్రి అనిత హెచ్చరించారు.
- Advertisement -