- Advertisement -
మేడిపల్లి: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండల పరిధిలోని పర్వతాపూర్లో కల్తీ పాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. గంగలపూడి మురళీ కృష్ణా రెడ్డి అనే వ్యక్తి హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్తో కల్లీ పాలు తయారు చేస్తున్నాడు. అతడి వద్ద నుంచి 110 లీటర్ల కల్తీపాలు, 1.1 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 19 గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లను ఎస్ఒటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మురళీ కృష్ణారెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
- Advertisement -