మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం వైసిపి ఎంపి మిథున్రెడ్డి చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యా యి. ఆఖరి ప్రయత్నంగా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కూడా శుక్రవారం తిరస్కరణకు గురైంది. బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరిం చింది. ఎపి హైకోర్టు ఇచ్చిన తీర్పు కొట్టివేసేందుకు అంగీకరించలేదు. ఎపి లిక్కర్ స్కామ్ కేసు సంచలనాలు సృష్టిస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచార ణ ఎదుర్కొన్న మిథున్ రెడ్డి అరెస్టు నుంచి రక్షణ కల్పించమని కోర్టును ఆశ్రయించారు. తొలుత ఎపి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై మొన్నటి వరకు విచారణ చేపట్టిన కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇదంతా రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసులని, అసలు ఆ శాఖలతో అధికారులతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో వాదించారు.
రెండు వైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఎపి లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ఎ4గా ఉన్నారు. లొంగిపోయే ందుకు కూడా సుప్రీంకోర్టు సమయం ఇవ్వలేదు.హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన వెంటనే సిట్ అధికారులు ఆయనకు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ కేసులో ఉన్న నిందితులు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి మొన్నటి వరకు సిట్ విచారణకు హాజరుకాకుండా ముప్పుతిప్పలు పెట్టారు. విదేశాలకు పారిపోయేందుకు కూడా ప్రయత్నించారు. ఇప్పుడు మిథున్ రెడ్డి విషయంలో అలాంటివి జరగకుండా ఉండేం దుకు ఆయనపై ఎల్ఒసి జారీ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా బెయిల్ రాకపోవడంతో ఆయన అరెస్టు ఖాయమంటూ ప్రచారం జరుగు తోంది.