Saturday, July 19, 2025

పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదు: నిమ్మల

- Advertisement -
- Advertisement -

అమరావతి: గత ప్రభుత్వ తప్పిదాలు సరిచేస్తూ రాష్ట్ర పాలనను గాడిలో పెడుతున్నామని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరిమేశారని అన్నారు. ఈ సందర్భంగా నిమ్మల మీడియాతో మాట్లాడుతూ..గత ఐదేళ్లలో ఇసుక, భూములు, గనులు, లిక్కర్ ను లూటీ చేశారని విమర్శించారు. జగన్ లూటీ చేసిన ప్రజాధనాన్ని కక్కిస్తాం అని తెలియజేశారు. గత ప్రభుత్వం గనుల యజమానులను బెదిరించి డబ్బు దోచుకున్నారని మండిపడ్డారు. వృథాగా పోయే నీటినే బనకచర్లకు ఉపయోగిస్తామని, పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని అన్నారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉందని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News