- Advertisement -
హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిధిలో రెండు గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు కురువనున్నాయి. మధ్యాహ్నం మూడు గంటల తరువాత శంషాబాద్, రాజేంద్రనగర్, బాలాపూర్, చాంద్రాయణగుట్ట, హయత్ నగర్, మియాపూర్, శేరిలింగంపల్లి, మియాపూర్, ఆర్ సిపురం, బీరంగూడ ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. నిన్నం భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఐటి జోన్ లో అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను బయటకు తీసుకొచ్చేందుకు జిహెచ్ ఎంసి సిబ్బంది బోట్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -