- Advertisement -
హైదరాబాద్: మలక్పేట్ కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. కాల్పులకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చందు నాయక్ను వివాహేతర సంబంధం కారణంగానే నిందితులు హత్య చేశారు. వివాహేతర సంబంధం, గుడిసెలు కట్టడంతో పాటు వ్యక్తిగత కారణాలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు వెల్లడించారు. బీహార్ నుంచి తుపాకులు తీసుకొచ్చి చందు నాయక్ ను ప్రత్యర్థులు హత్య చేశారు. హైదరాబాద్ మలక్పేట్లోని శాలివాహన నగర్ పార్క్ వద్ద మంగళవార ఉదయం సిపిఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి వాకింగ్ కు వెళ్లారు. అదే సమయంలో ఆయనపై దుండగులు తుపాకులతో కాల్చి చంపిన విషయం తెలిసిందే.
- Advertisement -