Tuesday, July 22, 2025

మాతా వైష్ణో దేవి యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. పలువురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

కాట్రా (జమ్మూ కాశ్మీర్): జమ్మూ కాశ్మీర్‌లో సోమవారం తెల్లవారుజామున కుండపోత వర్షాల కారణంగా కత్రాలోని మాతా వైష్ణో దేవి యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. యాత్ర ప్రారంభ ప్రదేశం బంగంగా ప్రాంతానికి సమీపంలో ఉదయం 8 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు యాత్రికులు గాయపడ్డారు. కాట్రా నుండి భవన్ వరకు పాత యాత్ర మార్గంలో ఉన్న బంగంగా ప్రాంతంలోని పర్వతం నుండి అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

పుణ్యక్షేత్ర బోర్డు సిబ్బంది, పోలీసు సిబ్బందితో సహా రెస్క్యూ బృందాలు సమాచారం అందిన వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి యాత్రికులను సురక్షితంగా తరలించారు. గాయపడిన యాత్రికులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. యాత్ర ట్రాక్ వెంట నిర్మించిన షెల్టర్లు కూడా కొండచరియలు విరిగిపడటం వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయని.. అదృష్టవశాత్తూ, రెస్క్యూ బృందాల సకాలంలో రావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షుల తెలిపారు.

ఈ మార్గం పుణ్యక్షేత్రాన్ని సందర్శించే యాత్రికులు ఉపయోగించే పురాతన, అత్యంత తరచుగా ఉపయోగించే మార్గాలలో ఒకటి. దీని ద్వారా ప్రతిరోజూ వేలాది మంది నడుస్తారు. ఈ సంఘటన తర్వాత ఆ మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News