Tuesday, September 9, 2025

సుప్రీంకోర్టుకు ప్రభాకర్‌రావు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. స్పెషల్ ఇన్విస్టిగేషన అధికారులు తనను వేధిస్తున్నారని సిబిఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుసుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తనను ప్రతి రోజూ విచారణకు పిలుస్తూ తనను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. తనకు సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటును విచారణ పేరుతో తొలగిస్తున్నారని ప్రభాకర్ రావు పిటీషన్ వేశారు. మరోవైపు ప్రభాకర్ రావుకి ఇచ్చిన రిలీఫ్ కొట్టివేయాలంటూ సిట్ అధికారులు కూడా సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు సహకరించక పోయినందునే వరసగా పిలవాల్సి వచ్చిందని వారు పిటీషన్ లో వివరించారు. ఇరు వర్గాల పిటీషన్లను స్వీకరించిన సుప్రీంకోర్టు కేసు విచారణ ఆగస్టు 4వ తేదీకి వాయిదా సుప్రీంకోర్టు వేసింది. ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రభాకర్‌రావు గత జూలై 15 న మరోసారి సిట్ విచారణకు హజరయ్యారు. డిసిపి విజయకుమార్, ఎసిపి వెంకటగిరి ఆయనను సుమారు ఎనిమిదిన్నర గంటల పాటు విచారించారు.

రాత్రి 7.30 సమయంలో సిట్ కార్యాలయం నుంచి పంపించారు. ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి మోసపూరిత విధానాలతో 618 మంది వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసిన విషయంలో ప్రభాకర్‌రావును సిట్ అధికారులు నిశితంగా విచారించారు. “నక్సల్స్ సమాచారం కోసమంటూ, మావోయిస్టులతో సంబంధం లేని రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేయించారు? మీరు అలా చేయడానికి కారణం ఏమిటీ?.. అది మీ సొంత నిర్ణయమా? లేక ఎవరైనా ఆదేశించారా? ’ అంటూ ప్రభాకర్‌రావుపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. మావోయిస్టుల సమాచారం కోసమంటూ ప్రభాకర్‌రావు పెట్టిన లిస్టులోని 618 మందిలో దాదాపు 300 మంది వాంగ్మూలాలను సిట్ అధికారులు ఇప్పటికే నమోదు చేశారు. ఈ వాంగ్మూలాలను ప్రభాకర్ రావు ముందు పెట్టి, వీరంతా మావోయిస్టులతో సంబంధం లేని వారే కదా? ఎందుకు మీరు ఆ విధంగా చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. ప్రభాకర్ రావు చాలా ప్రశ్నలకు సమాధానమివ్వలేదని, విచారణకు సహకరించలేదని.. “గుర్తులేదు.. తెలియదు” అనే సమాధానాలు ఇచ్చారని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News