Monday, July 28, 2025

నల్లగొండ బస్టాండ్ లో రెండేళ్ల బాలుడిని వదిలేసి… ప్రియుడితో పారిపోయిన తల్లి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: రెండేళ్ల బాలుడిని బస్టాండ్‌లో వదిలి ప్రియుడితో ప్రియురాలు పారిపోయింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ బస్టాండ్‌లో బాలుడు ఏడుస్తూ కనిపించడంతో ఆర్‌టిసి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ సైదులు తన సిబ్బందితో అక్కడికి చేరుకొని బాలుడిని చేరదీశాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ వివాహితకు సోషల్ మీడియాలో నల్లగొండ చెందిన యువకుడు పరిచయమయ్యాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశాలు పంపించుకోవడంతో పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహిత తన ప్రియుడితో కలిసి జీవించాలని నిర్ణయం తీసుకుంది. బాలుడితో కలిసి హైదరాబాద్ నుంచి నల్లగొండకు చేరుకుంది. అనంతరం బాలుడిని అక్కడే వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. సిసి కెమెరాల ఆధారంగా బాలుడి తల్లి, ప్రియుడ్ని పట్టుకున్నారు. భార్య ఇచ్చిన సమాచారం మేరకు భర్తను పిఎస్‌కు పోలీసులు పిలిచారు. ఆమె ప్రియుడితోనే వెళ్లిపోతానని చెప్పడంతో బాలుడిని తండ్రికి అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News