Monday, July 28, 2025

శ్రీరామసాగర్ ప్రాజెక్ట్‌లోకి 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి 50,503 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు 80.5 టిఎంసిలు ఉండగా ఆదివారం సాయంత్రం వరకు 1070.30 అడుగులు 23.866 టిఎంసిలుగా ఉందని ప్రాజెక్టు ఎఇఇ వంశీ తెలిపారు. ప్రాజెక్టు నుండి కాకతీయ కాలువ ద్వారా 100 క్యూసెక్కులు, మంచినీటి అవసరాలకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 291 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామని అన్నారు. మొత్తం కలిపి 622 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుండి విడుదల అవుతున్నట్లు వెల్లడించారు. గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటిమట్టం 1073.60 అడుగులు 29.933 టిఎంసిలుగా ఉందని అన్నారు. ఒకటి జూన్ నుండి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 13.045 టిఎంసిల నీరు వచ్చి చేరిందని, ఒకటి జూన్ నుండి ఇప్పటి వరకు 3,099 టిఎంసిల నీరు విడుదల చేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News