- Advertisement -
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు 12 కంపార్టుమెంట్లలో వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం తీసుకుంటున్నారు. నిన్న శ్రీవారిని 85,486 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,929 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.85 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -