Saturday, August 2, 2025

హైకోర్టులో నలుగురు జడ్జీల ప్రమాణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జీలు నియమాకమైన విషయం తెలిసిందే. గురువారం ఉదయం నలుగురు అదనపు జడ్జీలుగా నియమితులైన జస్టిస్‌ గౌస్‌ మీరా మొహినుద్దీన్, జస్టిస్‌ సుద్దాల చలపతిరావు, జస్టిస్‌ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌ లు హైకోర్టులో ప్రమాణ స్వీకారం చేశారు. సిజె జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌.. వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు జడ్జీలు, లాయర్లు పాల్గొన్నారు. కాగా, నలుగురు జడ్జీల రాకతో ప్రస్తుతం రాష్ట్రం హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News