Monday, August 11, 2025

తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. వానలు కురుస్తుండటంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ క్రమంలో సోమవారం శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 3 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచివున్నారు. దీంతో స్వామివారి దర్శనానికి భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. ఇక, ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు. నిన్న 82,628 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా… వీరిలో 30,505 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం విలువ రూ.3.73 కోట్లుగా టిటిడి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News