Tuesday, August 12, 2025

బిసిల గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ కుట్ర: తలసాని శ్రీనివాస్ యాదవ్

- Advertisement -
- Advertisement -

బిసిల గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్‌ఎస్ ఈనెల 14న కరీంనగర్‌లో ‘బిసి కదనభేరి’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభకు సంబంధించిన సన్నాహక సమావేశం సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బిఆర్‌ఎస్ నేతలు మీడియాతో మాట్లాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ..అధికారంలోకి వస్తే బిసిలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని, ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఇప్పుడు కేవలం ఓ తీర్మానం చేసి చేతులు దులుపుకుందని విమర్శించారు. కుల గణన, 42 శాతం రిజర్వేషన్ల అంశాలపై లోక్‌సభ ఎన్నికలకు ముందు హడావిడి చేసి ఇప్పుడు ఏమీ చేయడం లేదని ఆరోపించారు.

సిఎం రేవంత్ రెడ్డి బిసిల పట్ల చులకనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించవద్దని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, కరీంనగర్ ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పుడు మోసపూరిత నాటకాలు ఆడుతోందని విమర్శిం చారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ప్రధానిని, రాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నించారా? అని ప్రశ్నించారు .వంద మంది ఎంపిలు ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. బిసిలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించింది, ఆర్‌టిసి ఛైర్మన్‌గా, హైదరాబాద్ మేయర్‌గా బిసిలకే అవకాశం ఇచ్చింది కెసిఆర్ అని గుర్తుచేశారు. మంత్రులుగా కూడా బిసిలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చింది గత ప్రభుత్వమేనని చెప్పారు. శాసనమండలిలో పక్ష నేత మధుసూదనచారి మాట్లాడుతూ.. బిసిల గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బిసిలకు న్యాయం జరగాలంటే తమిళనాడు తరహాలో పోరాడాలని తాము కాంగ్రెస్‌కు సూచించినట్లు చెప్పారు.

ఈ అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌ఓ చేర్చడమే ఏకైక మార్గమని చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివా స్ గౌడ్ మాట్లాడుతూ..42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బిసిల సంఖ్యను తక్కువగా చూపారని విమ ర్శించారు. కేంద్రానికి పంపిన ఆర్డినెన్స్ ముసాయిదాలో రాజకీయ రిజర్వేషన్ల అంశం మా త్రమే ఉందని, విద్య, వైద్యం వంటి ఇతర రంగాలను కావాలనే విస్మరించారని ఆరోపించారు. సమావేశంలోఎంఎల్‌సిలు బండ ప్రకాష్, ఎల్. రమణ, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, బిసి కమిషన్ మాజీ వకులాభరణం కష్ణమోహన్, జెడ్‌పి మాజీ ఛైర్‌పర్పన్లు తుల ఉమ, కనుమల్ల విజయ, దావ వసంత, మాజీ ఎంఎల్‌లు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఒడితెల సతీష్ బాబు, విద్యాసాగర్ రావు, కోరుకంటి చందర్, మాజీ ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణ్‌రావు, నాయకులు బండ శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పార్టీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కరీంనరగర్ జిల్లా కేంద్రంలోని బిసి కదనభేరి సభ స్థలమైన మహాత్మాజ్యోతిబాపులే మైదానాన్ని నేతలు పరిశీలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News