Tuesday, August 12, 2025

మేం చేసిన అప్పులు 3.5లక్షల కోట్లే

- Advertisement -
- Advertisement -

ఎన్నికల సమయంలో రూ.8లక్షల కోట్లు అంటూ గాయిగాయి చేసిన కాంగ్రెస్
నాయకులు రేవంత్ గ్యాంగ్ చేసిన ఆరోపణలు అవాస్తవాలని పార్లమెంట్
సాక్షిగా బయటపడింది చేసిన అప్పులతో ఆస్తులు సృష్టించాం అప్పులు
3.5లక్షల కోట్లయితే ఆస్తులను 4.15లక్షల కోట్లకు చేర్చాం అప్పులు
చేయడంలో కాంగ్రెస్ దూకుడు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందని గాయి గాయి చేసిన రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నా రు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఆరోపిస్తున్నట్టుగా త మ హయాంలో రాష్ట్ర అప్పు 8 లక్షల కోట్లు కాదని, కేవలం 3.5 లక్షల కోట్లు మాత్రమే అన్న నిజాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చే సిన అప్పుల విషయంలో రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలన్న సంగతి పార్లమెంట్‌లో సోమవారం నిరూపించబడిందని చెప్పా రు.

గత ఎన్నికల సమయంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వా న్ని అప్రతిష్టపాలు చేయడానికి రూ.8 లక్షల కోట్ల అప్పులంటూ నిరాధార ప్రచారానికి దిగిన రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. తాము అధికారం నుంచి దిగిపోయిన తరువాత అంటే 2024 మార్చి 31 నాటికి రాష్ట్ర అప్పు రూ. 3,50, 520.39 కోట్లు మాత్రమే అని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అనవసరంగా అప్పులు చేయలేదని కెటిఆర్ తెలిపారు. సంక్షేమ పథకాలకే కాకుండా, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఆస్తుల సృష్టి కోసమే తెచ్చిన అప్పులను ఉపయోగించిందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు వివిధ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆ నిధులను ఖర్చు చేసిందని చెప్పారు. కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ, సమర్థతతోనే రాష్ట్రం వేగంగా పురోగమించిందని స్పష్టం చేశారు.

అప్పుల కంటే ఆస్తుల విలువ ఎక్కువ
బిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలివిగా ఆర్థిక నిర్వహణ చేసిన సంగతి కేంద్రం ఇచ్చిన నివేదికతో తెలుస్తుందని కెటిఆర్ చెప్పారు. 2023 -24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ అప్పులు రూ. 3,50,520.39 కోట్లు అయితే, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల విలువ రూ. 4,15,099.69 కోట్లుగా ఉందని వివరించారు. అంటే, అప్పుల కంటే ఆస్తుల విలువ రూ. 64,579 కోట్లు ఎక్కువగా ఉందని తెలిపారు. గత ఆరు ఆర్థిక సంవత్సరాలుగా (2018 -19 నుండి 2023 %24 వరకు) ప్రతి ఏటా తెలంగాణ అప్పుల కంటే ఆస్తుల విలువ రూ. 50 వేల కోట్లకు పైగా పెరిగిందని, బిఆర్‌ఎస్ ప్రభుత్వ సమర్థతకు ఈ గణాంకాలే నిదర్శనమని వ్యాఖ్యానించారు.

అప్పులు చేయడంలో కాంగ్రెస్ దూకుడు
బిఆర్‌ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తుందని ఆరోపించిన రేవంత్ రెడ్డి, తాను ముఖ్యమంత్రి అయిన మరు క్షణం నుంచే విపరీతంగా అప్పులు చేస్తున్నారని కెటిఆర్ ఆరోపించారు. 2023 డిసెంబర్ నుంచి అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ మార్గాల ద్వారా రూ. 1.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ అప్పులు చేసినట్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అంగీకరించిన విషయాన్ని గుర్తుచేశారు. ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండానే, హామీ ఇచ్చిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలుచేయకుండానే రేవంత్ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పు ఎందుకు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

రేవంత్ ప్రభుత్వ అనాలోచిత, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణతో తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కుపోతుందని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కేంద్రం ఇచ్చిన గణాంకాలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.నిజాలు తెలుసుకుని, నిరాధారమైన ఆరోపణలు మానుకుని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పారదర్శకత లేని ఆర్థిక విధానాలను అవలంబిస్తూ, అప్పులను ప్రజల మీద మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా తమ పరిపాలన గురించి సమీక్షించుకోవాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News