భువనేశ్వర్: ఓ బాలికను బలవంతంగా ఎస్ఐ పెళ్లి చేసుకొని ఆమెను శారీరకంగా, మానసికంగ హింసించడంతో ఆమెన ఇంటి నుంచి బయటకు గెట్టేశాడు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం బాలసోర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రాకరం… అమిత్ పాధి అనే వ్యక్తి బలియాపాల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. పూరిలోని ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. ఫేస్బుక్ బాలిక పరిచయం కావడంతో ఎస్ఐ అమిత్ ఆమెను ప్రేమలో దించాడు.
బాలిక తల్లిదండ్రులకు తెలియకుండా బాలికనుయ దేవాలయం పెళ్లి చేసుకున్నాడు. రెండో బాలికను హోటల్లో కూడా వివాహం చేసుకున్నాడు. బాలిక ఎస్ఐతో అత్తమామలతో కలిసి ఉంటుంది. గత కొన్ని రోజుల నుంచి బాలికను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. దీంతో ఇంట్లో నుంచి బాలికను బయటకు గెంటేశారు. దీంతో బాలిక తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఎస్ఐ అమిత్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.