మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూములకు భూధార్ నెంబర్ల కేటాయింపునకు అ వసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించా రు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై సిఎం రేవంత్రెడ్డి బుధవారం సా యంత్రం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల్లో వారసత్వ, ఇతర మ్యుటేషన్ల కు సంబంధిం చి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సిఎం సూచించారు. లైసెన్డ్ సర్వేయర్లు స ర్వే చేసిన అనంతరం రెగ్యులర్ సర్వేయర్లు వాటిని స్క్రూటినీ చేసేలా చూడాలని సిఎం ఆదేశించారు. కోర్ అర్బ న్ ఏరియాలో నూతనంగా నిర్మించనున్న 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నమూనాలను సిఎం పరిశీలించారు. ప్రతి కార్యాలయంలో పా ర్కింగ్, క్యాంటీన్, ఇతర మౌలిక వసతులు ఉండాలని, కా ర్యాయాలూ పూర్తిగా ప్రజలకు స్నేహపూర్వక
వా తావరణంలో సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని సిఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల్ల నిర్మా ణం పూర్తయిందని అధికారులు సిఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈనెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. హైదరాబాద్లోని హౌసింగ్ బోర్డు తో జాయింట్ వెంచర్గా ఉన్న ప్రాజెక్టుల్లో సమస్యలను త్వరగా పరిష్కరించాలని సిఎం అధికారులకు సూచించా రు. ఈ సమీక్షలో మంత్రి పొంగులేటి , సిఎం ముఖ్య కార్యదర్శులు వి.శేషాద్రి, కె.ఎస్.శ్రీనివాసరాజు, సిఎం కార్యదర్శి మాణిక్రాజ్, సిసిఎల్ఏ కార్యదర్శి లోకేశ్ కుమార్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, గృహ నిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి వి.పి. గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.