- Advertisement -
హైదరాబాద్: లైసెన్స్డ్ సర్వేయర్లకు రేపటి నుంచి రెండో విడత శిక్షణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్లకు 23 జిల్లా కేంద్రాల్లో రేపట్నుంచి శిక్షణ ఇస్తామని ప్రకటించారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షలు జరిపారు. అభ్యర్థులు ఆయా జిల్లాల్లో సోమవారం ఉదయం పది గంటల లోపు రిపోర్ట్ చేయాలని సూచించారు. లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలు అక్టోబర్ 2 నాటికి అందుబాటులోకి వస్తారని పొంగులేటి వివరించారు.
- Advertisement -