- Advertisement -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కొద్దిసేపటిక్రితమే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. సిఎం రేవంత్ తోపాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లపై న్యాయపరంగా అనుసరించాల్సిన విధానంపై కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం. అలాగే, రేపు ఉదయం సిఎం రేవంత్.. ఢిల్లీ నుంచి బిహార్ వెళ్లనున్నారు. బిహార్లో రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓట్ అధికార్ యాత్ర’లో పాల్గొననున్నారు.
- Advertisement -