Wednesday, August 27, 2025

నారాయణపేట లిఫ్ట్‌కు బ్రేక్

- Advertisement -
- Advertisement -

పర్యావరణ అనుమతులు లేవని
నిలిపివేత రాష్ట్ర ప్రభుత్వానికి
ఎన్‌జిటి ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేయాలని నేషనల్ గ్రీ న్ ట్రిబ్యునల్(ఎన్‌జిటి) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేయొద్దని ఎన్‌జిటి తన తాజా ఆదేశా ల్లో స్సష్టం చేసింది. ఇప్పటికే నారాయణపేట లి ఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి భూ సర్వే లు పూర్తయ్యాయి. ప్యాకేజీ -1, ప్యాకేజీ -2లుగా విభజించి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని, ఆ ప్రాజెక్ట్ పనులను నిలిపివేయాలని ఎన్‌జిటి స్పష్టం చేసింది. ఈ పరిణామం నేపథ్యంలో, ప్రాజెక్టు భవితవ్యం పర్యావరణ అనుమతులపై ఆధారపడి ఉంటుంది. ఎన్‌జిటి ఆదేశాలను పాటిస్తూ, అవసరమైన అనుమతులు పొందే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News