పోక్సో కేసులో నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషికి 51 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా దోషికి రూ.85 వేలు జరిమానా విధిస్తూ బాధితురాలికి రూ.7 లక్షల పరిహా రం అందించాలని కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా, తి ప్పర్తి మండలానికి చెందిన బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు ఖయ్యూంకి ఈ కఠిన కారాగార శిక్షను కోర్టు విధించింది. క్రైమ్ నం. 242/2021, తిప్పర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. (ఎస్సి. నం.94/2022)లో, తిప్పర్తి గ్రా మం, మండలానికి చెందిన నిందితుడు ఖయ్యూం ను ఎస్సి, ఎస్సి కోర్టు జడ్జి రోజారమణి దోషిగా తేల్చారు. అత్యాచారానికి 20 ఏళ్ల కారాగారం, పో క్సో చట్టం కింద మరో 20 ఏళ్ల కారాగారం, ఎస్ సి, ఎస్టి (సంబంధిత సెక్షన్) చట్టం కింద 10 ఏళ్ల కారాగార శిక్షను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వీటితో పాటు ఐపిసి సెక్షన్ 506 కింద ఏడాదిపాటు కారాగార శిక్షను కూడా విధించా రు. బాధితురాలు.. 16 ఏళ్ల బాలిక (ఎస్టి కమ్యూనిటీకి చెందిన అమ్మాయి).
నల్గొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి ఆధ్వర్యంలో తిప్పర్తి ఎస్ఐ శంకర్ బలమైన సాక్ష్యాధారాలను దాఖలు చేశారు. జడ్జి రోజా రమణి ఈ తరహా తీర్పును వెలువరించడం ఈ నెలలో (ఆగస్ట్ 2025) ఇది రెండోసారి. ఆ కేసులో బాలికపై అత్యాచారం చేసి, చంపిన వ్యక్తికి నల్గొండ పోక్సో కోర్టు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన 2013, ఏప్రిల్ 28న జరిగింది. నల్గొండ హైదర్ఖాన్గూడలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న 11 ఏళ్ల్ల బాలికపై మాన్యం చెల్క కు చెందిన మహ్మద్ ముక్రం అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భ యంతో ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశా డు. తర్వాత మృతదేహాన్ని డ్రైనేజీలో పడేశాడు. బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు నల్గొండ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాక విచారించి న పోలీసులు.. 2015లో చార్జిషీట్ దాఖలు చేశా రు.
పదేళ్లపాటు సుదీర్ఘ వాదనలు, వాయిదాలు కొ నసాగాయి. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలతో సెక్షన్ 376- ఏ, 302, 201, లైంగిక నేరాల నుం చి పిల్లల రక్షణ చట్టం 2012లోని సెక్షన్ 6 కింద నిందితుడు ముక్రంను పోక్సో కోర్టు దోషిగా తే ల్చింది. దీంతో నిందితుడు ముక్రంకు ఉరిశిక్ష వి ధిస్తూ పోక్సో కోర్టు ఇన్చార్జి జడ్జి జస్టిస్ రోజారమణి తీర్పు వెలువరించారు. దీంతో పాటు రూ. 1.10 లక్షల జరిమానా విధించారు. బాలిక కు టుంబానికి రూ.10 లక్షలు పరిహారం అందించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు.