Thursday, September 4, 2025

సిబిఐ విచారణపై బిజెపి ఏంచేస్తుందో చూద్దాం

- Advertisement -
- Advertisement -

విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ
రాస్తాం మీడియాతో చిట్‌చాట్‌లో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి : కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాయనున్నట్లు సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఉప రాష్ట్రపతి పదవికి ‘ఇండి’ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జస్టిస్ సు దర్శన్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం త న మంత్రివర్గ సహచరులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు. సమావేశానంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సి బిఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాశారా? అని ప్రశ్నించగా, రాత్రి రెండింటి వరకూ అసెంబ్లీలో ఉన్నామని, సిబిఐకి లేఖ రాయడానికి సమయం ఎక్కడిదని ఆయన ఎదురు ప్రశ్నించారు. అయినా అది తమ అధికారులు చూసుకుంటారని అన్నారు. సిబిఐ విచారణ జ రిపేందుకు రాష్ట్రానికి రాకుండా గత బిఆర్‌ఎస్ ప్రభు త్వం నిషేధం విధించింది కదా?,

దానిని ఎత్తివేస్తారా? అని ప్రశ్నించగా, నిషేధం అంటూ ఏమీ ఉండదన్నారు. అంశాల వారీగా లేఖ రాస్తే అందుకు కేంద్రం సమ్మతిస్తుందన్నారు. బిజెపిని ఫిక్స్ చేయడానికే సిబిఐ విచార ణ నిర్ణయం తీసుకున్నారా? అని ప్రశ్నించగా, అ దే లా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు. సకాలంలో సి బిఐ విచారణ చేపట్టి చర్యలకు ఉపక్రమించకపోతే, బి జెపి, బిఆర్‌ఎస్ కలిసే ఉన్నాయన్న సంకేతాలు పంపేందుకేనా?, బాల్‌ను వాళ్ళ కోర్టులోకి నెట్టేసారా? అని ప్ర శ్నించినా, ఆయన ‘వాళ్ళు’ ఎవరూ? అంటూ సమాధానం చెప్పకుండా దాట వేశారు. సిబిఐ విచారణ పూ ర్తి చేసేందుకు ఎంత గడువు కోరుతారని ప్రశ్నించగా, గడువు గురించి తాము ఎలా చెప్పగలమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ఆదివారం అసెంబ్లీలో రాత్రి బాగా పొద్దుపోయేంత వరకూ చర్చ జరగడం, సిబిఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించిన సం గతి తెలిసిందే. దీనిపై నేడో, రేపో గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయనున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News