- Advertisement -
మన తెలంగాణ/సిటీ బ్యూరో: ఖైరతాబాద్ మహా వినాయకుడికి భక్తులు పోటెత్తారు. తొమ్మిదవ రో జైన గురువారం దర్శనం కోసం బారులు తీరారు. శనివారం నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో శుక్రవారం భక్తుల దర్శనానికి అనుమతి లేకపోవడంతో చివరిరోజైన గురువారం వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన వేలాది మంది తరలివచ్చారు. మ హా వినాయకుడి ద ర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లో నిరీక్షించాల్సివచ్చింది. భక్తులు భారీ గా తరలిరావడంతో పోలీసులు మోహరించారు. శనివారం ఉదయం ఖైరతాబాద్ మండపం నుం చి మహావినాయకుడిని నిమజ్జనానికి తరలించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- Advertisement -