హైదరాబాద్: బాలాపూర్ గణేష్ లడ్డూ కొత్త రికార్డు సృష్టించింది. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో రూ.35 లక్షలు పలికింది. కర్మన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ వేలం పాటలో లడ్డూను దక్కించుకున్నాడు. గతేడాది కంటే రూ.4.99 లక్షలు ఎక్కువ ధర పలికింది. గత సంవత్సరం కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ గణేష్ లడ్డూను రూ.30.01 లక్షలకు దక్కించుకున్న విషయం విధితమే. 2023లో బాలాపూర్ గణేష్ లడ్డూ రూ.27 లక్షలు పలికిన విషయం తెలిసిందే.
Also Read: గంగ వైపు గణపయ్య
బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం పాట వివరాలు:
1994లో కొలను మోహన్రెడ్డి రూ.450, 1995లో కొలను మోహన్రెడ్డి- రూ.4,500లు, 1996లో కొలను కృష్ణారెడ్డి- రూ.18 వేలు, 1997లో కొలను కృష్ణారెడ్డి- రూ.28 వేలు, 1998లో కొలన్ మోహన్ రెడ్డి లడ్డూ- రూ.51 వేలు, 1999 కళ్లెం ప్రతాప్ రెడ్డి- రూ.65 వేలు, 2000 కొలన్ అంజిరెడ్డి- రూ.66 వేలు, 2001 జి. రఘనందన్ రెడ్డి- రూ.85 వేలు, 2002లో కందాడ మాధవరెడ్డి- రూ.1,05,000లు, 2003లో చిగిరినాథ బాల్ రెడ్డి- రూ.1,55,000లు, 2004లో కొలన్ మోహన్ రెడ్డి- రూ.2,01,000, 2005లో ఇబ్రహీ శేఖర్– రూ.2,08,000లు, 2006లో చిగురింత తిరుపతి- రెడ్డి రూ.3 లక్షలు, 2007లో జి.రఘనాథమ్ చారి- రూ.4,15000లు, 2008లో కొలన్ మోహన్ రెడ్డి- రూ.5,07,000లు, 2009లో సరిత- రూ.5,10,000, 2010లో కొడాలి శ్రీధర్ బాబు- రూ.5,35,000లు, 2011లో కొలన్ బ్రదర్స్- రూ.5,45,000లు, 2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి- రూ.7,50,000లు, 2013లో తీగల కృష్ణారెడ్డి- రూ.9,26,000లు, 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి- రూ.9,50,000లు, 2015లో కొలన్ మధన్ మోహన్ రెడ్డి- రూ.10,32,000లు, 2016లో స్కైలాబ్ రెడ్డి- రూ.14,65,000లు, 2017లో నాగం తిరుపతి రెడ్డి- రూ.15 లక్షల 60 వేలు, 2018లో తేరేటి శ్రీనివాస్ గుప్తా- రూ.16,60,000లు, 2019లో కొలను రామిరెడ్డి- రూ.17 లక్షల 60 వేలు, 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దు, 2021లో మర్రి శశాంక్ రెడ్డి, ఎపి ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్- రూ.18.90 లక్షలు, 2022లో వంగేటి లక్ష్మారెడ్డి- రూ.24,60,000లు, 2023లో దాసరి దయానంద్ రెడ్డి రూ. 27 లక్షలకు ఈ లడ్డూను దక్కించుకున్నారు.