గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు..పరీక్ష కేంద్రాల కేటాయింపు, హల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ ఎంఎల్ఎ హరీష్ రావు పేర్కొన్నారు. లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి.. ఈ కోర్టు తీర్పుకు మీరు చెప్పే సమాధానం ఏమిటి..? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. హడావుడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడ్డ సిఎం నిరాక్ష్యానికి విద్యార్థులు, నిరుద్యోగులు బలవుతున్నారని మండిపడ్డారు. గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలి అనే సోయి కూడా లేదని విమర్శించారు. పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదు అని సిఎం రేవంత్ రెడ్డి ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
హైకోర్టు తీర్పు రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు : హరీష్రావు
- Advertisement -
- Advertisement -
- Advertisement -