న్యూఢిల్లీ : బీహార్లో నాలుగు లేన్ల మోకామా ముంగేర్ రోడ్ నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని వెలువరించింది. బక్సర్ భగల్పూరు హై స్పీడ్ కారిడార్ పనులలో భాగమైన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ 4,447.38 కోట్ల వ్యయం అవుతుందని అంచనావేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ 4 లేన్ రోడ్డు నిర్మాణానికి అనుమతిని ఇచ్చారు. ఈ ఏడాది చివరిలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. హైబ్రిడ్ అన్యూటి మోడీ (హామ్) ప్రాతిపదికన ఈ రహదారి పనులు చేపడుతారని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ నిర్ణయం గురించి కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. బీహార్లోని పలు మారుమూల ప్రాంతాలకు సరైన రోడ్డు అనుసంధానం జరిగేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి జవుళి , సంబంధిత పరిశ్రమలు ఎక్కువగా ఉండే భగల్పూరుకు అనేక పట్టణాలతో రాదారి మార్గం ఏర్పడుతుంది.
బీహార్లో నాలుగు లేన్ల మోకామా రోడ్డుకు కేంద్రం ఒకే
- Advertisement -
- Advertisement -
- Advertisement -