హైదరాబాద్: యూరియా కృత్రిమ కొరతను కాంగ్రెస్ నాయకులు సృష్టించారని బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. కేంద్రం.. తెలంగాణ వాటా యూరియా ఎప్పుడో ఇచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా అమీర్ పేట్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి అంశంలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. గ్రూప్-1 అంశంలో న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని రామచందర్ తెలియజేశారు. గ్రూప్-1 అంశంలో టిజిపిఎస్సి తప్పుల మీద తప్పులు చేసిందని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం కంటే ఎక్కువ సీట్లు బిసిలకు ఇస్తామని, ఉమ్మడి వరంగల్ జిల్లాకు రాష్ట్ర కమిటీలో బిసిలకు చోటు దక్కలేదని విమర్శించారు. అధికార ప్రతినిధుల్లో వరంగల్ కు అవకాశం కల్పిస్తామని రామచందర్ రావు హామీ ఇచ్చారు.
Also Read : యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసింది: కెటిఆర్