- Advertisement -
పోక్సో కేసులో నిందితుడికి జీవితఖైదు, రూ.26,000 జరిమానా విధిస్తూ ఎల్బి నగర్లోని పోక్సో కోర్టు గురువారం తీర్పు చెప్పింది. మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలం, నాగోల్బండ్లగూడకు చెందిన దండుల సాయికుమార్ సెంట్రింగ్ వర్క్ చేస్తున్నాడు. నిందితుడి సమీపంలో ఉంటున్న బాలికపై నిందితుడు అత్యాచారం చేశాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఎల్బి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు పంపించారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. సాక్షాలు సేకరించిన పోలీసులు కోర్టు సమర్పించడంతో కోర్టు నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధించింది. బాధితురాలికి రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
Also Read: కాల్పుల్లో ట్రంప్ మిత్రుడు జార్లి కిర్క్ మృతి
- Advertisement -