Friday, September 12, 2025

అంతుచిక్కని చార్లీ కిర్క్ హంతకుడు

- Advertisement -
- Advertisement -

ఒరెమ్(యుఎస్): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ పార్టీ క్రియాశీలక కార్యకర్త చార్లీ కిర్క్(31) హత్యకు గురయ్యారు. అమెరికా ఇప్పటికే నిండిపోయింది, ఇండియా నుంచి వచ్చే వారికి వీసాలు ఇవ్వనవసరం లేదని, స్వదేశీ ప్రజలకే పాధాన్యం ఇవ్వాలని ఆయన సెప్టెంబర్ 2న ఓ పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించారు. చార్లీ కిర్క్, ‘టర్నింగ్ పాయింట్ యుఎస్‌ఎ’ యూత్ ఆర్గనైజేషన్ సిఈవో, సహవ్యవస్థాపకుడిగా ఉండేవారు. ఉతా వ్యాలీ యూనివర్శటీ క్యాంపస్‌లో ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొనప్పుడు కిర్క్ హత్యకు గురయ్యారు.

చార్లీ కిర్క్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించే పనిలో పోలీసులున్నారని గురువారం ఉతాలోని ఓ అధికారి తెలిపారు. అతడు పైకప్పు నుండి దూకి మరీ పారిపోయాడు.కాల్పులు జరిపిన ప్రాంతం నుండి శక్తిమంతమైన బోల్టాక్షన్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌బిఐ తెలిపింది. దర్యాప్తు రెండవ రోజు కూడా కొనసాగుతున్నది. షూటర్ ఎవరు, అతడి లక్షం ఏమిటి, అతడి లొకేషన్ లేక సాక్షం వంటివి ఏవి దర్యాప్తు అధికారులకు అంతుచిక్కడంలేదు. వారు సెక్యూరిటీ వీడియోలను కూడా జల్లెడ పట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News