కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న బహిరంగ సభకు వర్షం దెబ్బ పడింది. తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. బిసిలకు అధికారంలోకి వస్తే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో హామీ ఇచ్చింది. అందుకే ‘కామారెడ్డి డిక్లరేషన్’ అనే నామకరణం చేశారు. అయితే రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి, ఎదురైన సవాళ్ళను వివరించేందుకు కామారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నిర్ణయించారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ఇటీవల పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి ఏర్పాట్లు, జనసమీకరణపై చర్చించారు.
Also Read: గ్రూపు 1 పరీక్షను తిరిగి నిర్వహించండి: బూర నర్సయ్య గౌడ్