మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సిఎం దిశానిర్దేశం చేశారు. ఈ పుష్కరాల నేపథ్యంలో బాసర నుంచి భద్రాచలం వ రకు టెంపుల్ సెంట్రిక్ ఘాట్లను నిర్మించాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధాన ఆలయాల వద్ద శాశ్వత ఘాట్లను ని ర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఒకేసారి రెండు లక్షల మంది స్నానాలు చేసేందుకు వీలుగా ఈ ఘాట్లు ఉండాలని ఆయన సూచించారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో 2027, జూలైలో జరిగే గోదావరి పుష్కరా లు, ముందస్తు ప్రణాళికలపై సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మం త్రి కొండా సురేఖ, సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ బాసర, కాళేశ్వరం,
ధర్మపురి, భద్రాచలంతో పా టు ఇతర ఆలయాల జాబితాను సిద్ధం చేయాల ని ముఖ్యమంత్రి ఆదేశించారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల సమీపంలో ఉన్న గోదావరి పరీవాహక ఆలయాలకు ఎక్కువ ప్రా ధాన్యం ఇవ్వాలని సిఎం సూచించారు. ప్ర స్తు తం ఉన్న ఘాట్లను విస్తరించడంతో పాటు రో డ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పుష్కరాల సమయంలో దాదాపు రెండు లక్షల మంది ఒకేసారి స్నానాలు ఆచరించేందుకు వీలుగా సౌ కర్యాలు కల్పించాలని సూచించారు. ప్రతి ఆలయానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరు డిజైన్లలో ఘాట్లు నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. ఇందు కోసం పర్యాటక శాఖతో పాటు నీటిపారుదల, దేవాదాయశాఖలు కలిసి సమన్వయంతో
పనిచేయాలని సిఎం సూచించారు. రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని సిఎం రేవంత్ ఆదేశించారు. అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సిఎం రేవంత్ సూచించారు. 2027లో జూలై 23వ తేదీ నుంచి ప్రా రంభం కానున్న గోదావరి పుష్కరాలకు వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సిఎం ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల తీరం వెంట దాదాపు 74 ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రధాన ఆలయాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకని వాటిని మొ దటగా అభివృద్ధి చేయాలని సిఎం ఆదేశించా రు. ఆలయాల అభివృద్ధితో పాటు ఆయా ప్రాం తాల్లో శాశ్వత పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆయన సూచించారు. పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు.
ఒకే రోజు రెండు లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు, రహదారుల నిర్మాణంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వా హనాల పార్కింగ్, త్రాగునీరు, స్నానాల ఘా ట్లతో పాటు భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలన్నీ ఉండేలా ప్లాన్ చేసుకోవాలని సిఎం రేవంత్రెడ్డి చెప్పారు. మహా కుంభమేళాతో పా టు గతంలో వివిధ రాష్ట్రాల్లో పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల రూపకల్పనలో అనుభవమున్న కన్సల్టెన్సీలను నియమించుకోవాలని సూచించారు. గో దావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాలను సందర్శించి విడివిడిగా ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసుకోవాలని ఆయన చెప్పారు. అలాగే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధికి డిజైన్లు రూపొందించాలన్నారు. పు ష్కరాల ఏర్పాట్లకు కేంద్రం ప్రభుత్వ ప్రాయోజి త పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్తో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర పథకాలతో సమన్వయం ఉండే పనులు గుర్తించి, వాటికి అవసరమైన అనుమతులు తీ సుకోవాలని సిఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ద క్షిణ భారత కుంభమేళాకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ ప్యాకేజీ కోరేందుకు వీలుగా ఈ పనుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు. పుష్కరాల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో ప ర్యాటక, నీటి పారుదల, దేవాదాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సిఎం ఆదేశించారు.