మనతెలంగాణ/హైదరాబాద్: నిర్ధేశించిన లక్ష్యాలను అందుకునేందుకు వాణిజ్య పన్నుల యం త్రాంగం కృషి చేయాలని, జీఎస్టీ ఎగవేతదారులపై కఠినంగా వ్యవహారించాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శు క్రవారం సచివాలయంలో డిప్యూటీ సిఎం వా ణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆదాయం కోల్పోతున్న ప్రాంతాలను గుర్తించాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు, వ్యాపార లావాదేవీలను కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డిప్యూటీ సిఎం ఆదేశించారు. ఇకనుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కమర్షియల్ ట్యాక్స్ శాఖ ప్రగతి పై సమీక్ష నిర్వహిస్తానని డిప్యూటీ సిఎం భట్టి వి క్రమార్క తెలిపారు. జీఎస్టీ రేట్ రేషనలైజేషన్ ద్వారా రాష్ట్రం కోల్పోతున్న ఆదాయాన్ని క్షుణ్ణం గా అధ్యయనం చేసి ఓ నివేదిక ఇవ్వాలని డిప్యూ టీ సిఎం ఆదేశించారు. జీఎస్టీ ఎగవేతదారులపై నిఘా కొనసాగించాలని, అదేవిధంగా నిఘా వ్య వస్థ నిరంతరం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని, అధికారుల నిర్లక్ష్యం మూలంగా రాష్ట్ర ఆ దాయానికి గండి పడే ప్రమాదం ఉందని డిప్యూ టీ సిఎం అన్నారు. ఉన్నత స్థాయి అధికారులు నిత్యం ఏఐ టెక్నాలజీని
వినియోగించుకొని పర్యవేక్షణ సాగించాలని డిప్యూటీ సిఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే లావాదేవీల పన్నుల వసూళ్లలో వస్తున్న సమస్యలను అధిగమించడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. గత సంవత్సరానికి, ఈ సంవత్సరానికి కమర్షియల్ ట్యాక్స్ శాఖలోని ఎన్ఫోర్స్మెంట్, ఆడిట్ తదితర విభాగాల్లో సాధించిన ప్రగతిని సమీక్షించారు. ఆదాయం పెంచుకునేందుకు కమర్షియల్ ట్యాక్స్ శాఖలో అంతర్గతంగా కమిటీలు వేసి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఏ రిజ్వీ, కమిషనర్ హరిత, డిప్యూటీ సిఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్, డిప్యూటీ కమిషనర్లు సౌజన్య, వాసవి, సంయుక్తారాణి, సునీత, గీత తదితరులు పాల్గొన్నారు.