- Advertisement -
హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్జీ భార్య పోతుల కల్పన అలియాస్ సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో సభ్యురాలుగా సేవలందిస్తున్నారు. ఛత్తీస్గఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇంచార్జీగా పని చేస్తున్నారు. గద్వాల ప్రాంతానికి చెందిన కల్పన ఏకైక మహిళా నాయకురాలుగా పని చేస్తున్నట్టు సమాచారం. కల్పన 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. శనివారం ఆమె లొంగుబాటు గురించి డిజిపి జితేందర్ వివరాలు వెల్లడిస్తారు. ఆమెతో పాటు మరికొందరు మావోయిస్టులు లొంగిపోతున్నట్టు సమాచారం. ఆమెపై కోటి రూపాయాల రివార్డు కూడా ఉంది. పశ్చిమ బెంగాల్ లో 2011లో జరిగిన ఎన్కౌంటర్లో ఆమె భర్త కిషన్జీ మృతి చెందాడు.
Also Read: జిఎస్టి ఎగవేతదారులపై కొరడా
- Advertisement -