Saturday, September 13, 2025

మూడేళ్ల తర్వాత.. ఒటిటిలోకి వస్తున్న సినిమా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ మధ్యకాలంలో రిలీజ్‌ అయినా వారం లేదా రెండు వారాల్లో సినిమాలు ఒటిటిలోకి వచ్చేస్తున్నాయి. మరికొన్ని సినిమాలు అయితే.. నెల రోజుల వ్యవధిలో బుల్లితెరపై సందడి చేస్తాయి. కానీ, ఓ సినిమా మాత్రం ఏకంగా మూడేళ్ల తర్వాత ఒటిటిలోకి (AHA) వస్తోంది. ఆ సినిమాలో ఓ విశేషం కూడా ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ సినిమాలో విలన్‌‌గా నటించారు.

ఆ సినిమా పేరు ‘పగ పగ పగ’. 2022 సెప్టెంబర్ 22న ఈ సినిమా థియేటర్‌లో విడుదలైంది. పెద్ద తారగణం లేకపోవడంతో.. ఆకట్టుకొనే కథ, సన్నివేశాలు లేకపోడవంతో ఈ సినిమా అంతగా ఆడలేదు. ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపించలేదు. ఈ సినిమాకు రవి శ్రీ దుర్గా ప్రసాద్ దర్శకత్వం వహించగా.. కోటిపే సంగీతం సమకూచారు. అయితే ఇఫ్పుడు ఈ సినిమాను ఆహా (AHA) కొనుగోలు చేసింది. త్వరలోనే ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఒటిటిలో అయినా.. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో.. లేదో..? చూడాలి.

Also Read : సందేశభరిత వినోదాత్మక చిత్రం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News