Sunday, September 14, 2025

మత్స్యకారుడి వలకు చిక్కిన వింతైన భారీ చేప

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం, రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన బోళ్ల భూమయ్య అనే మత్స్యకారుడి వలలో వింతైన చేప చిక్కింది. వివరాల్లోకి వెళ్తే.. ఎల్‌ఎండి రిజర్వాయర్‌లో రోజువారి లాగే చేపలు పట్టేందుకు శనివారం వెళ్ళాడు. ఉదయం తన వలలు తీస్తుండగా ఎర్ర రంగులో విచిత్రంగా ఉన్న వెరైటీ చేప భారీ సైజులో కనిపించడంతో పైకి తీసి గమనించాడు. ఇట్లాంటి చేప ఇప్పటివరకు ఎల్‌ఎండి రిజర్వాయర్లో పడలేదని స్థానిక మత్స్యకారులు తెలిపారు. ఇది ఇతర రాష్ట్రాలకు చెందిన చేపగా పలువురు మత్స్యకారులు, స్థానికులు భావిస్తున్నారు. ఈ వెరైటీ చేపను చూసేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News